← Back to news

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పొన్నం

By rajinikant nagilla· 20 Aug 2026· Hanumakonda

TG: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని రాజీవ్ గాంధీ బలంగా విశ్వసించారని పేర్కొన్నారు. యువత అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించేందుకు ఆయన తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

More in Local