మ్యాన్హోల్లో ఇరుక్కున్న కాలు

TG : హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్దనున్న బస్స్టాప్ సమీపంలో పదేళ్ల బాలుడు కాలు మ్యాన్ హోల్లో ఇరుక్కుంది. స్థానికుల సమాచారం మేరకు డయల్-100 ద్వారా ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సైఫాబాద్ PS కానిస్టేబుల్ ప్రశాంత్ ఫైర్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా బాలుడిని సేఫ్గా బయటకు తీశారు. ఈ ఘటనలో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.


