← Back to news

గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి

By NANI.M· 19 Aug 2026· Rowthulapudi, Rowthulapudi, Kakinada
గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇప్పించాలని రైతులు జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు రౌతులపూడి టీడీపీ యువ నాయకుడు పైల వేణు రైతులతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. రైతుల సమస్యను సానుకూలంగా విన్న జాయింట్‌ కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌‌ను ఆదేశించినట్లు తెలిపారు.

More in Local