రేపు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

AP: రేపు (ఈనెల 20న) వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వందలాదిమంది నిరుద్యోగులు తరలిరావాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం మదనపురం మండల కార్యదర్శి వెంకటరములు మాట్లాడుతూ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చిన కేంద్రం రెండేళ్లయినా ఇంకా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. దేశంలో నిరుద్యోగులు ప్రతి సంవత్సరము పెరిగిపోతున్నారన్నారు.



