← Back to news

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి

By dk· 8 Aug 2026· హైదరాబాద్
రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి

TG: సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత BRSకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే BRS నేతలు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరమవుతాయని, గత ప్రభుత్వం కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే 12లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పదేళ్ల పాలనలో పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించలేదని ఫైరయ్యారు.

More in Politics