Students కోసం బస్సులివ్వండి

AP: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సులు ఏర్పాటు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రం ఇచ్చారు. చదువు కోసం ప్రతిరోజు వందల మంది విద్యార్థులు ఎమ్మిగనూరు వస్తున్నారని, సరైన సమయానికి బస్సులు లేక కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. ఉన్న బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఫుట్బోర్డ్పై నిలబడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. కాబట్టి విద్యార్థులకు, ప్రయాణికులకు విడివిడిగా బస్సులు వేయాలని కోరారు.



