← Back to news

బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

By AJAY KUMAR· 19 Aug 2026· ఖమ్మం
బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

TG: ఖమ్మం జిల్లాలోని ఏదిలాపురం ప్రజలు రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఊరి నుంచి బయటకు రావాలంటే బురదగా ఉన్న రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోంది. బైక్‌లపై వెళ్లేవారు స్కిడ్ అయ్యి కింద పడుతున్నారు. స్కూల్ పిల్లల దుస్తులపై బురద పడి ఇబ్బందులు పడుతున్నారు. అదే దారిలో చెత్తను తీసుకెళ్లే డంపింగ్ యార్డ్ వాహనాలు తిరగడంతో రోడ్డు మరింత పాడైంది. అధికారులకు ఎన్నిసార్లు అడిగిన పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!
బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

More in Local