ట్రిపుల్ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలి

TG: ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నేషనల్ హైవేస్, రైల్వే, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా భూసేకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అవార్డు పాసైన భూముల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేసి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.




