మహనీయుల ఆశయ సాధనకు గ్రామగ్రామాన యాత్ర

TG: బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గౌతమ బుద్ధుడు చూపిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన యాత్రకు శ్రీకారం చుట్టారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గొల్ల సతీష్, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం ఆధ్వర్యంలో సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం నుంచి గ్రామ యాత్ర ప్రారంభమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు వివరించి వాళ్లను చైతన్యపరచడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.



