క్రీడా మైదానాలపై నిర్లక్ష్యం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్కిల్ పరిధిలోని క్రీడా మైదానాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్వాల్గూడ, శంషాబాద్ డివిజన్లలోని పలు మైదానాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఆటలకు అనుకూలంగా లేకుండా మారాయని స్థానికులు చెబుతున్నారు. యువత, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు కూడా భద్రత లేకపోవడంతో దొంగల పాలయ్యాయని ఆరోపించారు. మైదానాల దుస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.




