నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీకి అమెరికా వెళ్లినప్పుడు సీఎంగా గద్దెనెక్కారు. కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. జనసేన నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుమారుడే.



