మీరేం తింటారు ? అన్నమా, జొన్నలా

కేంద్రం చేపట్టిన జనాభా లెక్కల్లో ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు. ప్రజల ఆహార అలవాట్లు కూడా తెలుసుకుంటున్నారు. వరి అన్నం, గోధుమ రొట్టెలు కాకుండా జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలేమైనా తింటున్నారా అన్న ప్రశ్న కూడా సెన్సస్ లెక్కల్లో ఉంది. ఇలా ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకొని వాటి ఆధారంగా రేషన్ కార్డుల్ని పంపిణీ చేయాలన్నదే కేంద్రం ఆలోచనగా ఉంది. రేషన్ కార్డులపై ఇప్పటివరకు బియ్యం, గోధుమలే సరఫరా చేస్తున్నారు. ఇకపై చిరు ధాన్యాలు కూడా పంపిణీ చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది.



