ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని !!

కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం మొదలైంది. జొన్నగిరిలో598 హెక్టార్లలో 13 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. 2027 నాటికి కనీసం 600 కిలోల బంగారాన్ని తవ్వి తీయాలని నిర్ణయించారు. జియోమైసూర్ సర్వీసెస్ సంస్థ ఈ తవ్వకాలు చేపడుతుంది. ప్రాజెక్టు కాలం 15 ఏళ్లు. యేటా వెయ్యి కిలోల వార్షిక ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ గనులన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. తొలిసారిగా ఈ గని నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు.



