తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం

చార్ ధామ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు ఉదయం 8 గంటలకు తెరుచుకున్నాయి. శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసుకునే ఈ ఆలయాన్ని మళ్లీ అక్షయ తృతీయ తర్వాత రెండు మూడు రోజులకి తీస్తారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకి అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదారానాథ్ సందర్శనకి రికార్డు స్థాయిలో 14.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేదారాథ్ లో మహా శివుడి దర్శనం కోసమే ఏకంగా 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.



