← Back to news

ఎక్కడి బస్సులు అక్కడే.. ప్రయాణికుల ఇక్కట్లు

By aravinda nyayapati· 22 Apr 2026· Hyderabad
ఎక్కడి బస్సులు అక్కడే.. ప్రయాణికుల ఇక్కట్లు

తెలంగాణలో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. బస్సుల్లేక బస్టాండులు బోసిగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి సమ్మెకు దిగారు. డిపోల దగ్గరే ధర్నా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దశలవారీగా వారి డిమాండ్లు తీరుస్తామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.

More in Local